11, ఏప్రిల్ 2010, ఆదివారం

మరో మలుపు!

ఇది నా బ్లాగు జీవితంలో మరో మలుపు. ఎట్టకేలకు, తెలుగులోనూ ఒక బ్లాగు మొదలు పెట్టేసి మన తెలుగు పాండిత్యం కూడా పరీక్షించుకోవాలని-పరిరక్షించుకోవాలని ఒక నిర్ణయం తీసేస్కున్నా.  తీస్కునేముందు అవసరమా? అని నన్ను నేను ప్రశ్నించుకున్నా! 
ఈ బ్లాగు ఎందుకు మొదలు పెట్టావు?
ఆ మధ్యన "save telugu" అని నా ఇంగ్లీష్ బ్లాగులో నా ఆవేశం వెళ్లగక్కా. సరే మరి జనాలకు చెప్పే ముందు నేను తెలుగు ఎలా మాట్లాడతనో, రాస్తానో నేను చుస్కోవాలి, జనాలకి చెప్పాలిగా - వాళ్ళు అడిగేముందే.

జేబి గారు,..
నేనింకా యువకుడినే కాబట్టి, ఐ టి లో ఉన్న కాబట్టి - పేరు మాత్రమె అలవాటు. అందుకని గారు తగిలించాకుండా, జేబి అని పిలిస్తే చాలండి.


నీ పేరు - "JB - జేబి" ఏంటి?
నా పూర్తి పేరుకి సంక్షిప్త నామమది. ఈ జేబీ అని పిలిపించుకోవాలని నిర్ణయం తెస్కోవడానికి ఒక పెద్ద కధుంది. వేరే టపా రాస్తానులెండి. అది రాసాక నా బాధ అర్థం అవుతుంది కాబట్టి నా పేరు తెలిసిన నష్టమేం ఉండదండి. ( పెద్ద రహస్యమేమి కాదు, నా ఇంగ్లీష్ బ్లాగులో ఉంటుంది, నా ఈ మెయిల్ ఐడి లో ఉంటుంది).

ఈ బ్ల్గాగులో ఏమి రాస్తావు?
బ్లాగు నెత్హి మీద రాసాను చుడండి. నేను తెగ అలోచిస్తానండి. మరి ఆలోచించినపుడు బోల్డు ప్రశ్నలు వస్తాయిగా - ఆ ప్రశ్నలకి సమాధానాలు వెతికినపుడు, మరిన్ని ఆలోచనలు, ప్రశ్నలు ....

చాలు బాబూ - నీ సోది మాకెందుకు?
అంటే... నా అనుభవాల నించి మీరు నేర్చుకోవచు, నా అభిప్రాయాలూ మీకు కొన్ని ప్రశ్నలు రేకేత్తిన్చచ్చు. అయినా నాది ఏ సి బోగీ ప్రయాణం లాగా పాకం కాదండి - జనరల్ బోగీ లాగా సందడి ప్రయాణం - సరదా ముచట్లు, నా  అగచాట్లు కూడా ఉంటాయి - మీకు కాలక్షేపానికి.

ఇది నీ మొదటి టపా కదా - మరి 'మరో మలుపు' అంటావేంటి?
తెలుగు లో మొదటిదే కాని, నా బ్లాగు ప్రయాణం 2005 లోనే మొదలు పెట్టానులెండి. మా సంస్థ అంతర్-బ్లాగుల్లో 200 పైగానే రాసి అక్కడి జనాలని తినేశాను. ఇక నా మిత్రులు కూడా బ్లాగు పేరు ఎత్తితే ... వద్దులెండి. అందుకే ఒక తెలుగు బ్లాగు మొదలెట్టేసి,  కూడలి, జల్లెడ లాంటి చోట్ల పెట్టేసి ...

అంటే కూడలి, జల్లెడ లకు వచ్చే వారందరికి నీ సోది చదవడం తప్పితే పని లేదనా?
అలాగని కాదు - కూడలి, జల్లెడ నాకు ఎప్పటినించో తెలుసు. కొన్ని విషయాలు తెలుగులోనే బాగా రాయగలనని ఈ మధ్యే గ్రహించా. మరి కొన్ని, వాటి పరిధి దృష్ట్యా తెలుగు పాఠకులకే బాగా చేరుతాయి. పైగా Google transliterate మరియు లేఖిని వచ్చాక తెలుగు వ్రాయడం తేలిక అయ్యింది. అసలు విషయం, ఒక నెల రోజులనించి పని తక్కువుండి, కాలక్షేపానికి కూడలి/జల్లెడ లలో ఉన్న అందరి బ్లాగులు చదివేశా - ముఖ్యంగా శ్రీయుతులు  నెమలికన్ను మురళి , మనోనేత్రం సందీప్, జాజిపూలు నేస్తం,  సుజాత, సౌమ్య, నాన్న భాస్కర్, వేణు శ్రీకాంత్, అబ్రకదబ్ర,, మాలతి, జయ గార్ల (ఇంకా చాలా మంది ఉన్నారు) అనుభవాలు, జ్ఞాపకాలు, ముచ్చట్లు నన్ను ఆకట్టుకున్నాయి - నన్ను కూడా 'పుచ్చుకోవడమే'  కాదు, 'ఇచ్చుకోవడం' కూడా చెయ్యాలి అని ప్రేరేపించాయి. ఇంక నా మిగిలిన నిర్నయల్లాగా కాకుండా, క్రమం తప్పకుండ టపాలు రాయడం మిగిలింది.

మరి అన్ని బ్లాగులు చదివినవాడివి ఎక్కడ ఒక్క వ్యాఖ్య కూడా పెట్టలేదెం?
అంటే అవన్నీ ఆఫీసు నించి చదివాను కదండీ. ఇంటి దగ్గర బోలెడు పని ఉండేది - ఐ పి ఎల్ చూడాలి, సినిమాలు చూడాలి, కొన్ని చదువుకోవల్సినవి - కుదరలేదండి. ఇపుడు తీరిక దొరికింది, రాయాలన్న ఆసక్తి పెరిగింది. ఇంక ఇపుడు వ్యాఖ్యలు కూడా రాస్తానులెండి. నాకు తెలుసు, ఒక బ్లాగరికి వ్యాఖ్యలెంత ముఖ్యమో!  ఎవరి బ్లాగులోనన్న మాల్డెన్ అనీ ఊర్నించి ముద్రలు పడితే అది నేనే.

2 కామెంట్‌లు:

గమనిక: వ్యాఖ్యల్లోని విషయమునకు సంబంధిత వ్యాఖ్యాతలే బాధ్య్లులు. బ్లాగు యజమానికి ఎటువంటి సంబంధములేదు. ఒక వ్యాఖ్య ఎవరికైన ఇబ్బందికరమనిపించినా, నాకు తెలిపినచో తగుచర్య తీసుకొనబడును.

ధన్యవాదములు.
~జేబి.
yjbasu510@yahoo.co.in